Tuesday, November 11, 2014

ఆదివాసీ సమూహాలను సంక్షోభంలోనికి నెట్టివేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయం సహాయం కోరుతున్నది..  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతంగాన్నా ఆదుకొని.. భవిష్యత్ లో ఆ దిశగా ఆలోచించకుండా ఆసరా ఇవ్వలాని వెడుకుంటున్నారు...ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి పత్తి రైతులు పంటపోలలోనే ఉరితాళ్లాకు వేలాడుతున్నారు...పురుగుమందు తాగుతూ కుటుంబానికి తీరని కష్టం తెచ్చిపెడుతున్నారు...
....ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామం రత్నపురి శ్రీనివాస్ ...ఐదు ఎకరాల్లో  పత్తి పంట పండిస్తున్నాడు..పంటకోసం రెండు లక్షల అప్పు చేసాడు... ఈ సారి వర్షబావ పరిస్థితుల కారణంగా పంట సరిగా పండలేదు.. అరకోరగా వచ్చిన పంటను అమ్మేందుకు సిసిఐ కి తిసుకేళ్తే తేమ శాతం పెరుతో కనీస మద్దతు ధరకు తక్కువకు తిసుకున్నారు...ధళారుల దగ్గరికేళ్తె పరిస్థితి మరింత గోరం.. గత సంవత్సరం తిసుకున్న అప్పులు ఈ సారి అప్పులు తలకు మించిన బారంగా మారాయి..దింతో అదే పత్తి చెన్లో చెట్టుకు ఉరేసుకోని ఆత్మహత్య చెసుకున్నాడు...శ్రీనివాస్ కు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు...ఇప్పుడు మిగిలిన పంటను ఇంటికి తెచ్చుకుందామన్నా కూలిలు ఎవరు రావడం లేదని వాపోతుంది ఆ కుటుంబం .. రైతు ఉరేసుకున్న పంటచేన్లోకి  రావడానికి కూలిలు బయపడుతుండడంతో పుట్టేడు దుఃఖంలోనే ఆ కుటుంబం మొత్తం చేనుకు వెల్తూ పంట తెచ్చుకుంటున్నారు...జిల్లాలోని వెనుకబాటుతనంతో సరైన చైతన్యం లేక..ఇటు కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి ...ఉర్లోవారి తోడ్పాటు లేక రైతు కుటుంబాలు  తివ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాయు...
.. రైతు శ్రీనివాస్ కుటుంబాన్ని జస్టిస్ చంద్రకుమార్,సిపిఎం నేత బండి దత్తాత్రి ఇతర రైతు సంఘ నేతలు పరామర్శించి..కుటుంబంలో అత్మ స్థైర్యం నింపే ప్రయత్నం చేసారు... ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతుల పరిస్థితి ఇవే కాకుండా కౌలు రైతాంగం పరిస్థితి నానాటికీ మరింత దారుణంగా తయారవుతున్నది. సమా జంలో గౌరవంగా బతకాలనే ఆకాం క్షతో కొద్దిపాటి భూమి గల పేద రైతులు- రక రకాల కారణాలతో స్వయంగా వ్యవసాయం చేసుకోలేని వారి భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. అయితేకేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూలరైతు వ్యతిరేక ప్రపంచీకరణ విధానాల వల్ల వ్యవసాయ రంగానికి సబ్సిడీలను ఉపసంహరించాయ్
.... ఆత్మహత్యలకు ప్రాధాన కారణం వ్యవసాయానికి కీలకమైన విత్తనాలుఎరువుల సరఫరాలో బడా బహుళ జాతి (ఎం.ఎన్‌.సి.) కంపెనీల పట్టు పెరుగుతున్నది. ఫలితంగా విత్తనాలుఎరువులుపురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యవసాయంపై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. రైతులకు ఆదాయం తగ్గుతున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్స్‌డీనష్టపరిహారం కౌలు రైతులకు అందించలేక పోతున్నది.

...రైతు ఆత్మహత్యల నేపథ్యాన్నిఆకలి చావుల నేపథ్యాలను వేరువేరుగా చూడాల్చి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉన్న సారూ పత్యలను గమనిస్తే ఈ రెండూ కూడా భారత వ్యవసా యరంగంలో తీసుకుంటున్న విధానాల ఫలితమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విధాన నిర్ణే తలు వ్యవసాయరంగంపై వహిస్తున్న నిర్లక్ష్యం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలనుముఖ్యంగా భూమిలేని పేదవర్గాలనుచిన్నసన్నకారు రైతాంగాన్ని,  ఆదివాసీ సమూ హాలను సంక్షోభంలోనికి నెట్టివేస్తోంది. రాష్ట్రంలోని ఆదిలాబా ద్‌లాంటి నేలల ఆదివాసీప్రాంతాలలో కూడా సాంప్రదాయ ఆహార పంటల స్థానంలో పత్తి పంటల ప్రవేశం దీనికి పెద్ద ఉదా హరణ. ఫలితంగా ఒక కనిపించిన సంక్షోభం అక్కడి ఆదీవాసీ సమూహాన్ని నిశ్శబ్దంగా నిర్మూలిస్తోందిఆహారలేమి తీవ్ర స్థాయిలో ఉంది దానితో రక్తహీనతతో చనిపోతున్న గర్భిణులునవజాత శిశువుల సంఖ్య ప్రమాదకరంగా ఉంది..........

No comments:

Post a Comment