Saturday, August 16, 2014

గిరిజనులు...ఎం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తు ఉండిపోయారు...........

ఆదివాసి జిల్లా ఆదిలాబాద్ లో మెరుగైన వైద్యసెవలందించేందుకు ఎర్పాటు చెసిన రిమ్స్ వైద్య కళాశాల ఆ దిశలో మాత్రం అడుగేయడంలేదు...ప్రారంభం అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానే లేదు...సౌకర్యాల కోరత,సిబ్బంది ఇక్కడ పనిచేసేందుకు ఇష్టపడక ట్రన్స్ ఫర్లు చెసుకోని వెల్తుండడం .బస్టాండ్ లలో ఉండే పబ్లిక్ టాయిలెట్లలో కంటే దారుణమైన కంపు ఆసుపత్రి నిండా ఆవరించి అక్కడి అపరిశుభ్ర పరిసరాల స్థాయి తెలుపుతాయు....
... ఆస్పత్రిలో వైద్యుల కొరత, పారిశుధ్య, అస్తవ్యస్త నిర్వహణ, పరికరాలు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన లీడర్లు కాంట్రక్టర్ల అండగా ఉండడం , అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కడ ఉండేందుకు వారు విముఖత చూపుతున్నారు. గత ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధిని గాలికొదిలేసింది. నిధులు మంజూరులో వివక్ష చూపడంతో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందలేదు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వమైన రిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యులు నియమించి, అన్ని రకాల వసుతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్  హాస్పిటల్ కి గడ్డుకాలం దాపురించింది. అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్.. ప్రస్తుతం వైద్యులు , నర్సులు ఇంటిదారి పడుతుండడంతో  అగమ్యగోచరంగా మారింది. జిల్లావాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని  2008లో రూ.121 కోట్లతో రిమ్స్ ప్రారంభించారు. రిమ్స్ ఆస్పత్రి మొదటినుండి అసౌకర్యాలతోనే కోనసాగుతుంది. ఆస్పత్రిలో 21 విభాగాలకు 148 వైద్య పోస్టులు మంజూరు చేశారు. కానీ ఈ పోస్టులు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు.

వాయిస్... ఇప్పటికి రిమ్స్ లో  83 డాక్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన విభాగాలకు ప్రొఫెసర్లు లేరు. మెడిసిన్ మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, ఫార్మాకాలేజీ, డెంటిస్టులో ఐదుగురు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. వైద్యం, విద్యా బోధన చేయడంలో ప్రొఫెసర్లదే కీలకపాత్ర. హాస్పిటల్ లో వైద్యులు వెళ్లిపోతుండడంతో రిమ్స్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
 బైట్...
వాయిస్... నెల రోజుల్లో రిమ్స్ నుంచి 10 మంది వైద్యులు వెళ్లిపోయారు. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, మైక్రోబయోలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ హంసన్, డెంటిస్టు అనిల్‌కుమార్, ఫార్మకాలజీ అసిస్టెం ట్ ప్రొఫెసర్ మహ్మద్‌షాకీర్, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెంగుల్‌వార్‌లతోపాటు పలువురు వైద్యులు విధుల కాలపరిమితి ఉన్నా విధుల నుంచి తప్పుకుంటున్నారు.

. రిమ్స్‌లో పనిచేసే వైద్యులకు భారీగా వేతనాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు ప్రొఫెసర్లకు రూ.లక్ష, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.90 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.75 వేలు, ట్యూటర్లకు రూ.40 వేలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నా రిమ్స్‌లో వైద్యులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా ఎవరు రావడం లేదు. దీనికి కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్యం. వెనుకబడిన జిల్లాకు దూరభారంతోపాటు, ఇక్కడ వసతులు ఉండవనే భావనతో వైద్యులు రావడం లేదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇక్కడి కంపు వాతావరణాన్ని చూసి బయపడి రిమ్స్ ని రిజక్ట్ చెస్తున్నారు....

... పాలకుల నిర్లక్ష్యమే రిమ్స్‌కు శాపంగా మారుతోంది. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా.. వైద్యులకు రూ.లక్షల వేతనాలు చెల్లిస్తున్నా.. ఆస్పత్రి తీరు మారడం లేదు. రిమ్స్‌లో 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా సౌకర్యాలు, వైద్యం రోగులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. అత్యాధునిక హంగులతో భవనాలు నిర్మిస్తున్నప్పటికి రోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
....

... లోకల్ ఎంఎల్ఎ ప్రస్థుత మంత్రి జోగు రామన్న అండదండలున్న కాంట్రక్టర్లు ఇక్కడి పనులు చెయుస్తుండడంతో ..వారు ఎలాంటి సర్విస్ అందించినా అడిగేవారే ఉండరు... జితాలు సరిగా ఇవ్వక మొన్నటిదాక పారిశుద్య కార్మికులు సమ్మలె ఉండడంతో రిమ్స్ ఆవరణ కంపు కోట్టింది... వారిని సమ్మెనుండి విరమింపచేసిన తరువాత అదే పరిస్థితి నెలకోంది...ఆసుపత్రి ఆవరణ మొత్తం చెత్తా , చెదారం, వాడి పడెసిన బ్యాండెజిలు..రక్తపు మరకలు  ఉండడంతో ఇక్కడికి వెల్లే రోగులకు కోత్త రోగాలు వస్తున్నాయ్,...కాంట్రక్టులన్ని స్థానిక రాజకీయ నేతలు పంచుకోవడంతో ఎ పని జరగడం లేదు...  కోత్తగా వచ్చిన కలెక్టర్ లకు ఫిర్యాదులు అందడం ఆకస్మిక తనిఖి నిర్వహించడం....అక్కడి పరిస్థితి చూసి అవక్కవడం..హాస్పిటల్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం కామన్ గా మారిపోయింది....బాత్రుంలలో నిళ్లు లేకపోవడం...ఎక్కడ చూసినా చెత్తా చేదారంతో నిండి ఉండడం చూసి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. కాని కాంట్రక్టర్లను మాత్రం ఎమీ చేయలేకపోవడంతో ఈ హస్పిటల్ కంపుగానే ఉండిపోతుంది.....దినికి తోడన్నట్టు. నిత్యం ఆందోళనలతో , సిబ్బంది సమ్మె నినాదాలతో రోగులను హడలెత్తిస్తుంటారు..
...మొన్నటికి మొన్న అగస్టు మొదటివారంలో ఆసుపత్రిలో చుక్క నీరు లేక... ఆపరేషన్ లు సైతం ఆగిపోయాయు...ఎమర్జేన్సి ఉండి బ్లిడింగ్ అవుతున్న పెషెంట్ లకు నీళ్లు లేక డాక్టర్లు అపరేషన్ చెయలేకపోయారు..మీడియా వెల్లి హాడావిడి చెసినా పట్టించుకునే వాడే కరువయ్యారు..అక్కడికి వచ్చిన రోగులంత గిరిజనులు.... రోగులు వారి బందువులు ఎం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తు ఉండిపోయారు.... అదే ఇంకోచోట అయి ఉంటే పెద్ద గోడవ చెసుండేవారు...కాని అమాయక గిరిజనులకు అవేం  తెలియవు....అదే ఇక్కడి రాజకీయ నాయకులకు అలుసైంది...
....ఓ వైపు హాస్పిటల్ లో నిళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..హాస్పిటల్ యంత్రంగం జిల్లా మంత్రి జోగురామన్నకు అదేరోజు ...అదే రిమ్స్ లో సన్మన కార్యక్రమం ఎర్పాట్లలో నిమగ్నమయ్యారు....మంత్రిగారు వచ్చి అదే ఆపరేషన్ థియెటర్ పక్కన శాలువాతో సన్మానం చెయించుకోని సమస్యను కనీసం అడగి తెలుసుకోకుండానే అక్కడినుండి హాడావుడి గా వెల్లిపోయాడు...ఎందుకంటే అదే రోజు ఆయనకు ఆదిలాబాద్ లో వేరే సన్మాన కార్యక్రమాలున్నాయ్......
... రోగులు వారితో పాటు వచ్చేవారకి ముక్కుకు కర్చిఫ్ లేనిదే హస్పిటల్ లో అరనినముషం కూడా ఉండలేని పరిస్థితి... బాత్రుంలు క్లీన్ చెసెందుకు సైతం నిళ్లు లేక ఎక్కడ చూసినా గలిజుగానే ఉంటుంది..

.....ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోతుంది. జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా ఉన్నప్పటికీ రిమ్స్‌ కళాశాల ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అండంలేదు. 2004 సంవత్సరంలో 120 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన ఈ వైద్య కళాశాల  సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు... సరైన వైద్యులు లేక ప్రజలకు వైద్య సేవలు అందకపోవడంతో ప్రతి చిన్న జబ్బులకు హైదరాబాద్‌, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాలతో పాటు కడపలో ప్రారంభమైన రిమ్స్‌ కళాశాల పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాల ఇంకా ఎక్కడ వెసిన గోంగడి అక్కడే అన్న చందంగా ఉంది...


....  ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కానిఇటు జిల్లా యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలకు శాపంగా మారింది. పేరుకు మాత్రమే రిమ్స్‌ కళాశాల ఉందని, రిమ్స్‌ కళాశాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. కీలక మైన విభాగాలలో వైద్యులు లేక పేద ప్రజలకు వైద్యం అందడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స చేయకపోవడంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతూ మహారాష్ట్రలోని నాగపూర్‌,యావత్‌మల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు కొద్ది పాటి వైద్యం కూడా అందడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడంతో తరుచుగా విధులను బహిష్కరించడంతో ప్రజలకు వైద్య సేవలందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
...జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలతో నిర్మించి నాటి ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించిన రీమ్స్‌ కళాశాలను కష్టాల నిత్యం వెంటాడుతున్నాయ్... వసతుల లేమి, కళాశాలలో డైరెక్టర్‌ల మధ్య సమన్వయ లోపం గ్రూపు విబేదాలు తోడై అటు రోగులకే కాకుండా విద్యార్థులకు ...రోగులకు  తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయు....
....  కాలేజిలోని మొదటి బ్యాచ్ ఎంబిబిఎస్ పూర్తి చెసుకోని బయటకు వచ్చింది కాని ఇంకా అరకోర వసతులతోనే అంతా సాగిపోతుంది.... 2008 ఫిబ్రవరి 01న శంఖు స్థాపన గావించబడ్డ రీమ్స్‌కు అదే సంవత్సరం వైయస్‌ఆర్‌ శంఖు స్థాపన చేసి ప్రోఫెసర్లకు మెరుగైన జీతాలను అందిస్తున్నామని ప్రకటించినప్పటికి ఆతర్వాతి కాలంలో రీమ్స్‌ డైరెక్టర్‌తో పాటు రిజిష్టార్‌లకు మధ్య గ్రూపు తగాదాలు రావడం అవి చిలికిచిలికి గాలివానలా మారడం ఇక్కడ సర్వసాదారనం....ఇప్పటికైనా వెనుకబడిన జిల్లా ప్రజలకు ఆదునిక వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రిమ్స్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు
.
...రిమ్స్ లో వైద్య సేవలందించాల్సిన వైద్యులంతా బయట క్లినిక్ లు నడుపుకుంటుండడంతో ...ఇక్కడికి వచ్చే రోగులను సరిగా పట్టించుకోకుండా వారి క్లినిక్ లకు రమ్మంటు రిఫర్ చెస్కుంటారు....ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజనులే ఉండడంతో ఎక్కువ మందికి సరైన వసతులు లేకపోవడంతో విషజ్వరాల బారిన పడుతుంటారు...వారంత ఇక్కడి రిమ్స్ కి వచ్చినా సిబ్బంది , వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో మృత్యవాతపడుతున్నారు....పక్కనే ఉన్న మహారాష్ట్ర కు వెల్లి అక్కడ వైద్యం చెయించుకుంటున్నారు.....
...

:జిల్లాలో వైద్యానికి పెద్ద దిక్కైనటువంటి రిమ్స్ తరచూ వివాదాలతో కోట్టుమిట్టాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది...ఇప్పటికైన కోత్త ప్రభుత్వం.. వైద్యశాఖ అధికారులు స్పందించి...హస్పిటల్ కాంట్రక్టర్ల పై ప్రెమ తగ్గించి..వివాదాలకు చెక్ పెట్టకపోతే రిమ్స్ గిరిజన రోగుల పాలిట విషంగా మారే అవకాశముంది...

No comments:

Post a Comment