Friday, August 31, 2012

సెప్టేంబర్ లో ఏం జరగనుంది????


సియమ్ మార్పు జరుగుతుందా......? బోత్సా పదవి ఉంటుందా .....? బాబుగారికి మరిన్ని సమస్యలు స్వాగతం పలుకుతాయా? మిలియన్ మార్చ్ జరగనుందా?
గత కొన్ని రొజులుగా రాష్ట్ర రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయు.రాబోయే కాలం మరింత గడ్డుకాలంగా మారనుంది...... ఇప్పటికే రాష్ట్ర ప్రధాన నేతలందరు ఏదో ఓక సమస్యతో ఉన్నారు ఏప్పుడు ఏవరి పదవికి గండం వస్తుందోనని ఏవరికివారు టెన్షన్ పడడంతో సరిపోతుంది...ఏంతో మంది ఏదురుచూస్తున్నట్టుగా కిరణ్ సీటుకిందికి నీళ్లోస్తాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికి ... అదిగో ఇదిగో అంటూ పుకార్లు మాత్రమె వరదలై ప్రవహిస్తున్నాయు..అజాద్ మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఉండదని చెప్పలేనని, అయితే ఆ చర్చ జరగలేదని అజాద్ అనడంతో మరోసారి సంక్షోభానికి, లాబీయింగ్ లకు అవకాశం ఇచ్చినట్లయింది.
ఇక బోత్సా సంగతి సరేసరి సత్తిబాబు ను మర్చెస్తున్నారని దాదాపు అధికారిక ప్రకటనే తరువాయు అన్నంత లెవల్లో ప్రచారం జరిగింది. ఆయనగారు కూడా డిసైడ్ అయి...వేదాంత దోరణిలో పదవి ఉంటే ఏంతా ఉడితే ఏంతా అని సన్నిహితులతో చెప్పుకున్నారు..అయితే ఇ ప్రచార పర్వాల వెనక ఏవరున్నరోనన్నదీ అందరికీ తెలిసిందే..బొత్సను మార్చుతారని ముఖ్యమంత్రి వర్గం ప్రచారం చేయగా, సి.ఎమ్.ను మార్చవచ్చని బొత్స వర్గం ప్రచారం చేసింది.ఈ మధ్యలో ఇద్దరిని మార్చరని కొందరు అభిప్రాయపడినా, బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయనను తప్పిస్తారేమోనన్న భావన కలిగించాయి.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి మరోలా ఉంది... అదికారంలో లేకున్నా ప్రభుత్వలోపాలపై స్పందిద్దాం అంటే ......బాబు గారి పాలన పదేళ్లు దాటినా ప్రజలు ఇంకా మరిచిపోలేక పోతున్నారు..విద్యుత్ పోరులో తెలుగు తమ్ముల్లు పాల్గోంటున్నప్పటికి బషీర్ బాగ్ ఉదంతాలు వారిని పిడకలల్లా వెంటాడుతున్నాయ్ ..ఇక SC వర్గికరణ లాంటి తెనే తట్టులను కెలికి మరో సమస్యకు తానే శ్రీకారం చుట్టుకున్నాడు...తెలంగాణ పై తెల్చేస్తానంటూ ప్రకటిస్తుండడంతో దాని పర్యావసానం ఏలా ఉంటుందో చూడాలి..
సెప్టెంబర్ నెలలొ తెలంగాణ పై ఏదో తెల్చేస్తానంటు కేంద్రం సంకేతాలిస్తుండడంతో మరోసారి అదికార, ప్రతికార పక్షాలు మరిన్ని ఇబ్బందులు ఏదుర్కోక తప్పదు .కేంద్రం ఏ నిర్ణయం తిసుకున్నా సమస్యలు మాత్రం తక్కువో ఏక్కువో ఉండనైతే ఉంటాయు... సెప్టేంబర్ 30 మిలియన్ మార్చ్ తరహాలో మరో కార్యక్రమం రుపోందిస్తుంది TJAC అది కార్యరుపం దాల్చితే అదో సమస్య అయ్యే అవకాశం ఉంది...ఇలా సమస్యల మీద సమస్యలతో సెప్టేంబర్ రాబోతుంది. మరో పెద్ద సమస్య మద్యంతరం ముంచుకోస్తుందా అనేది వస్తే రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది ........ఏమొ ఏదైనా జరగోచ్చు..చుద్దాం ఏం జరుగుతుందో.....

Saturday, August 25, 2012

వంద సీట్లిస్తామంటే నమ్మేస్తారా....

సహజంగానే 2014 ఏన్నికల కలలో అన్ని పార్టిలు విహరిస్తున్నాయ్.. గెలుపు దారులను వెతుక్కునే పనిలో హాడావిడి మొదలుపెట్టాయు... అప్పుడేప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహీంచి ప్రజలకు సైతం అందనంత ఏత్తుకేదిగిన హైటెక్ చంద్రబాబు అదే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఏంతగానో కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాడు.. ఒక్కో సమస్యను నరుక్కుంటూ దూసుకుపోతున్నాడు ..మొన్నామద్య వెనుకబడిన తరగతుల వారికి వంద టిక్కెట్లు అంటూ బిసిలను మరోసారి టిడిపికి దగ్గర చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు.దింతో బిసి సంఘాల నేతలు బాబుగారిని సన్మానించేందుకు క్యూ కట్టారు .ఇదంతా చూసిన YSRCP నేతలు మనం తక్కువ తిన్నాం అంటూ వంద టిక్కెట్లు కాదు, వంద సీట్లు ఇవ్వాలని వారి గౌరవాధ్యక్షురాలి చే ప్రకటింపచేసారు..తాజాగ ఈ రోజు ఆ పార్టి బిసి నేత గట్టు రాంచందర్రావ్ తో బిసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సైతం ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు..

పార్టిల గతం ప్రజలు మరిచిపోతారా?

బాబు గారు ప్రజా సమస్యలపై ఏప్పుడు ప్రజలవద్దకేళ్లిన గతంలో మిరేం చేశారు.. అనే ప్రశ్నే ఏదురవుతుంది అందుకే 2004లో సైతం జనాలను నమ్మించడంలో విఫలం అయ్యారు....మరి 2014 వరకైనా ప్రజలు బాబు గతం మరిచి ఓట్లేస్తారో లేదో అనేది పెద్ద ప్రశ్నే..అలాగే YSRపార్టి బిసిలకు వంద సిట్లు పధక ప్రచారంలో బాగంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బిసి సంఘాల నేత కృష్ణయ్య గతంలో YS రాజశేఖర్ రెడ్డి హామిలను గుర్తు చేశారు.చట్టసభల్లో బిసిలకు ఇస్తామన్న50శాతం రిదర్వేషన్ల లాంటివాటిని లేవలేత్తారు. ముందు గతంలో ఇచ్చిన డిమాండ్లపై క్లారిటి కావలన్నారు ..ఇలా బిసిల రాగం అందుకున్న రేండు పార్టిల గతం వారి భవిష్యత్ పై ప్రభావం చుపే అవకాశం లేకపోలేదు....





Saturday, August 18, 2012

అవి నీళ్లు కాదంట...నీళ్లకంటే ఏక్కువేనంటున్నారు......



అందం కావాలా అయితే అయిదు లీటర్ల నీళ్లు తాగండి... ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా దానికీ నీళ్లే తాగాలి ..రోజూ ఉదయాన్నే రేండు లీటర్లని మద్యాహ్ననికి మరో మూడులీటర్లని రాత్రికి మరిన్ని లీటర్లంటు నీళ్లే సర్వరోగనివారినిలా ప్రచారం జరిగిపోయింది.ఇలా నీళ్లు తాగించే తతంగం వెనక అసలు కథేంటీ....కలికాలంలో ఖరీదైన వస్తువుల జాబితాలో చేరిపోయిన నీళ్లను అదే పనిగా తాగించేస్తూ మన డబ్బులను మంచినిళ్లలా ఖర్చు చేయించడం వేనక వ్యాపారుల ప్రయెజమేనా అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు.నిజంగా ఎన్ని నీళ్లు తాగాలి....ప్రపంచవ్యాప్తంగా జరిగిపోయిన ఈ నీళ్ల ప్రచారానికి కారాణాలేంటి....

ఈ మద్యకాలంలో అన్ని రోగాలకు నీళ్లే నివారణ అని ఏన్ని ఏక్కువ నీళ్లు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటామంటూ ప్రచారం జరిగపోయింది..
చర్మం పై ముడుతలు పోవాలన్నా , అందంగా తయారవ్వాలన్నా నీళ్లు తాగండంటూ చెప్పేస్తున్నారు..కిడ్ని వ్యాదులుంటే ఇంకోంచేం ఏక్కువ నీళ్లు తాగాలని అనుకుంటూ తాగేస్తున్నారు.. కాని అసలు దీని వేనుక బాటిళ్ల వ్యాపారుల ప్రయెజనాలే తప్ప అసలు నిజం వేరే ఉందంని వ్యాపారుల ప్రయెజనాలకోలసం అపోహలను విజయనంతంగా ప్రచారంలోకి తెచ్చారంటున్నారు శాస్త్రవేత్తలు ...ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీ పరిశోదకుడు స్పెరో సిండోస్ చేసిన సర్వేల్లో ఈ విషయాలు వేలుగులోకి వచ్చాయి...

అసలు ఆరోగ్యంగా ఉండే మనిషి రోజుకి ఏన్ని నీళ్లు తాగాలి ...రోజుకి రెండు లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుందని డాక్టర్లంటున్నారు ...కీడ్నీ వ్యాదులతో బాదపడే వారు ఏక్కువ నీళ్లు తాగితే మరింత ఇబ్బందులను ఏదర్కోవాల్సుంటుందని డాక్టర్లు చేబుతున్నారు. ....గుండె జబ్బులున్న వారు సైతం నీళ్లు తక్కువ తాగలని సూచిస్తున్నారు వైద్యులు....మనం రోజూ జ్యూస్ లు , పాలు తదితర ద్రవపదార్థాలన్నింటినిలో నీళ్లు ఉంటాయి కావునా వాటిని కలుపుకోని 2లీ వచ్చేలా తాగితే సరిపోతుందంటున్నారు. ఏక్కువ నీళ్లు తాగినంత మాత్రానా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదంటున్నారు...ఏండాకాలంలో మాత్రం కోంచెం ఏక్కువ నీళ్లు తాగాలని ..వర్షాకాలం, చలికాలం మాత్రం నీళ్లు అతిగా తాగాల్సిన అవసరముండదంటున్నారు...



నీళ్లు ఏక్కువ తాగాలన్నది కేవలం అపోహేనని ..తాగల్సినన్ని నీళ్లకంటే ఏక్కువ నీళ్లు తాగితే ఇబ్బందులను ఏదర్కోవాల్సి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.. నీళ్లు తక్కువ తాగినా ఏక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు.. గతంలో ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని ఓ ప్రచారం జరిగిపోయిందని దానిలో ఏలాంటి శాస్త్రీయత లేకున్నా ప్రజలు గుడ్డిగా నమ్మి అయిల్ పుల్లింగ్ చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అలాంటి ప్రచారమే ఇప్పుడు నీళ్ల విషయంలో జరిగుతోందంటున్నారు డాక్టర్లు ....



వ్యాపారులు మాత్రం తమ ప్రయెజనాల కోసం ప్రచారాన్ని మరింత ముందుకు తిసుకేళ్తున్నారు... మా నీళ్లలో ఏక్కువ మినరల్స్ ఉంటాయని ఓకరంటే మా నీళ్లలో ఏక్కువ ఆక్సిజన్ ఉందంటూ జనాల్లోకేళ్తు వారి జేబులు కాలీ చేసేస్తున్నారు....కోత్తగా ఓ కంపేని అయితే మా నీళ్లు అసలు నీళ్లే కావని విటిలో న్యుట్రియంట్స్ సైతం ఉంటాయంటూ ప్రచారానికి తెరలేపారు...ఏవరికి తోచిన పద్దతిలో వారు తమ దాహాన్ని తీర్చుకుంటే చాలని అపోహలను అసత్యాలను నమ్మి ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దంటున్నారు శాస్త్రవేత్తలు......









Saturday, August 11, 2012

క్షనికావేశంలో చేసిన నేరాలకు జీవితాంతం జైలు గోడల మధ్య ఉండిపోవాల్సిందేనా




వయసు 50 పైనే , గుండె సమస్యలతో సతమతం అవుతున్నాడు, షుగర్ వ్యాదితో కాలు తిసేయాల్సిన పరిస్థితి, ఈ ఆపత్కాలంలో అయినవారంతా వున్నా వారి సేవలకు సైతం ఆ అబాగ్యుడు నోచుకోలేదు. క్షణికావేశంలో తెలిసో తెలియకో చేసిన నేరానికి 22 ఏళ్లుగా జైల్లో మగ్గుతూ కుటుంబానికి దూరమై మదనపడుతున్నాడు .కుటుంబ పెద్ద చేసిన నేరానికి ఆ కుటుంబం కూడా పెద్ద శిక్షే అనుబవిస్తుంది.తండ్రి విడుదలకోసం కొడుకు చెయని ప్రయత్నంఅంటూ లేదు, అనారోగ్యంగా ఉన్న బర్తను చూసి ఆ ఇల్లాలు విలవిలలాడుతోంది.

ఖధీర్ క్షణికావేశంలో తెలిసో తెలియకో చేసిన నేరానికి శిక్షగా 22 ఏళ్లుగా జైళ్లలోనే మగ్గిపోతున్నాడు.
ఖదీర్ ఇప్పుడు వయసు పైబడి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాదపడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. షుగర్ వ్యాది తీవ్రత అధికంగా ఉండడంతో ఖధీర్ కాలు కూడా తిసేయల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.తన బర్తకు జీవిత చరమాంకంలోనైనా సేవలు చేసుకునే సౌకర్యం లేకపోయింది ఆ అబాగ్యురాలికి...ఖధీర్ లాంటివాళ్లేందరో మన జైల్లల్లో మగ్గిపోతున్నారు...........

ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే అతనిలో పరివర్తన కలుగుతుందని పలు కమిషన్లు నివేదికలిచ్చాయి.

క్షనికావేశంలో చేసిన నేరాలకు జీవితాంతం జైలు నాలుగు గోడల మధ్య ఉండిపోవాల్సిందేనా అని ఆ ఖైదీలు విలపిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో ఉండిపోతే మా కుటుంబాలు పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రసాదించే క్షమాభిక్ష దొరికేనా అని ఖైధీలు వారి కుటుంబం ఎదురు చూస్తున్నారు. నిజానికి ఒక ఖైదీ ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే అతనిలో పరివర్తన కలుగుతుందని పలు కమిషన్లు నివేదికలిచ్చాయి. అయినా, ప్రభుత్వానికి అవి చెవికెక్కవు. ఇప్పటికీ ఎంతో మంది ఖైదీలు రెమిషన్‌తో కలుపుకొని 20 సంవత్సరాలు దాటినా ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు. మానావ హక్కుల సంఘాలు సైతం ప్రభుత్వ పోకడలపై మండిపడుతున్నారు. ఖదీర్ లాంటి వారిని మనవాతాకోణంలో ఆలోచించి మెర్సి పిటిషన్ కు స్పందించి విడుదల చేయలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చెస్తున్నాయి....
ఏళ్లకేళ్లు జైల్లలో మగ్గుతున్న వారిగురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ప్రభుత్వాలు సైతం వారి గురించి మరిచిపోతుంది. కనీసం జాతీయ పర్వదినాలు, గాంధీ జయంతి నాడు లభించే క్షమాభిక్షకైనా నోచుకొంటామా లేదా అని ఆ ఖైధీల ఆశలు అడిఆశలే అవుతున్నాయి....
ఇలా జైలు గోడలకే పరిమితమవ్వడానికి కారణం వారికి రాజకీయ అండదండలు, అర్థ బలం లేకపోవడమే. ఇలాంటి ఖైదీలు చర్లపల్లి జైలులో కోకొల్లలు.
ఖదీర్ లాంటివారి విషయంలో కోందరు స్థానిక నేతలు ప్రయత్నాలు చేసిన అవి సఫలం అవుతాయన్న గ్యారింటీ లెకుండా పోయింది.
ప్రజా ప్రతినిధులను హత్య చేసిన వారు క్షమాబిక్ష పరిదిలోకిరారు....

ఫ్యాక్షనిస్టులు, మద్దెల చెరువు సూరి, గౌరు వెంకట్‌డ్డిలాంటి వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ప్రభుత్వం సాధారణ ఖైదీలపట్ల శ్రద్ధ కనబరచటం లేదని ఖైదీలు వారి కుటుంబాలు వాపోతున్నాయు. ఉదాహరణకు ఖధీర్ విడుదలపై జైలు అధికారులను వివరణ కోరగా, ఆయుధాల చట్టం, 120బీ, 302, 353, ప్రభుత్వాధికారులను, ప్రజా ప్రతినిధులను హత్య చేసిన వారిని క్షమాభిక్ష పరిధిలోకి తీసుకు రావద్దని ప్రభుత్వమే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసినందున కొందరికి క్షమాభిక్ష దొరకలేదని అధికారులు అంటున్నారు.తెలిపారు. ఈ ఆగస్టు 15న క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని, అందిన వెంటనే అర్హులైన ఖైదీలందరిని క్షమాభిక్షపై విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని జైలు అధికారులు అంటున్నారు.

22యేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్న సరబ్‌జిత్‌ను విడుదల చేయాల్సిందిగా కోరుతోంది భారత ప్రభుత్వం.....
మానవతా కోణంలో బారతియుడి విముక్తి కోసం దాయాది దేశానికి విజ్ఞప్తి చెస్తున్న ప్రభుత్వాలు మన దేశంలోనే సంవత్సరాల తరబడి దుర్బర జైలు జివితం గడుపుతున్న పౌరులపై ఎందకింత వివక్ష చుపుతోందనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది.


Wednesday, August 1, 2012

KVP కి YS గుర్తోచ్చాడు.........



వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబందువు కేవిపి రాంచందర్రావ్ ఉన్నట్టుండి మిత్రుడిపై ప్రేమను గాంధీ భవన్ లో జరిగిన పార్టిమిటింగ్ లో బయటపెట్టారు. కాంగ్రెస్ అంతా ఓకదిక్కు జగన్ మరోదిక్కు అయినప్పుడు KVP మాత్రం కాంగ్రేస్ తోనే ఉండిపోయారు. ఏనాడు జగన్ పై నేగిటివ్ గా కాని పాజిటివ్ గా గాని కామెంట్ చేయలేదు. సమయం దోరికినప్పుడల్లా ys ను సినియర్ నేతలు ఆడిపోసుకుంటున్నా మనోడు మౌనంగానే ఉన్నారు ...కాని గాంధి భవన్ లో మంగళవారం జరిగిన యువజన కాంగ్రేస్ నేతల ప్రమాణ స్వికారోత్సవం రోజున మాత్రం YS జిగిరి దోస్త్ KVP తన మిత్రుడి ఫోటో లేదని తెగ ఫిలయిపోయారు... దాదాపు ఏడ్చినంత పనిచేశారు.
ఈ ఫోటో ఏడుపుల సీన్ చూసి మరికోందరు నేతలు కూడా ఫోటో కామెంట్లు చేసేశారు. కార్యకర్తలైతే ఓక్కసారిగా ఈలలు చప్పట్లు YS నినాదాలతో హొరెత్తించారు..
నిన్న గాక మొన్ననే ys ఫోటోలు తిసి ఇందిరమ్మ ఫోటోలు పెట్టాలని నివేదికలు సమర్పించుకున్న నేతలకు KVP మాటలు షాక్ ఇచ్చినట్లైంది.. సినియర్ నేతలు , ఇంతకీ KVP యువజన కాంగ్రెస్ మిటింగ్ లో YS సెంటిమెంట్ ను ఎందుకు తట్టిలేపాడో మరి? కాంగ్రెస్ సినియర్లు , రాజకీయవిశ్లేషకులు ఈ మాటలకు అర్థాలను కొత్త కొత్త కోణాల్లో ఏకి పీకి పారేయడంలో అప్పుడే బిజి అయిపోయారు..

బాబు గారి బిసి బిస్కేట్ రాజకీయ జపం యమ బోరు......



చంద్రబాబునాయిడు రాబోయే ఏన్నికల్లో సిట్ల పంపకం అప్పుడే మొదలుపెట్టాడు. బిసిలకే అన్ని అనేసరికి ఆ నేతలు ఇప్పుడే
స్విట్లుకూడా పంచుకుంటున్నారు...గెలిచేవారుంటే వందకుపైగా సిట్లిస్తామంటున్నాడు.బిసిలకిస్తున్న ఆఫర్లన్ని నిలబెట్టుకుంటాడో లెదో కాని కులాలు వర్గాల వారిగా ఓట్లరాజకీయాలను ప్రారంబించేశాడు. దినితో అన్ని పార్టిలు ఒక్కసారిగా బుజాలు తడుముకుంటున్నాయి అధికార కాంగ్రేస్ సైతం స్పందిచాల్సిన పరిస్థితి ఏర్పరిచారు మన బాబు..

కాని నిజంగానే బిసి వర్గాలకే వంద సీట్లు ఇస్తే అప్పుడు ఎదురయ్యే రాజకీయ పరిణామాల మీద పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరికి సందేహాలు కూడా ఉన్నాయి. అయినా పార్టీ విజయావకాశాలపై బిసి బిస్కేట్ రాజకీయం ఎంతగా పని చేస్తుందో కాని బలహిన వర్గాలపై నారావారి వరాల జల్లు చూసి టిడిపి బిసి నేతలంతా వారి అధ్యక్షులవారిని సన్మానాలతో ముంచేత్తిస్తున్నారు.ఈ సన్మానలే కోంచేం శృతి మించుతున్నాయి మొత్తం స్కిమ్ నే పబ్లిసిటీ స్టంట్ అనుకునేలా చేస్తున్నాయి.అయితే గేలిచేవారుంటే ఏ కులమైనా, మతమైనా సరే ఏ పార్టి అయినా వదులుకుంటుందా? మొత్తం మీద చంద్రబాబు 2014 ఏన్నికలకు బాగానే ప్రిపేర్అవుతున్నారు.........