Thursday, October 11, 2012

తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరుగుతోంది?


రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏంతో ఉత్కంఠ రెపిన తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరిగింది.. టి ఆర్ ఏస్ , జెఏసి ల మద్య సఖ్యత తగ్గిందా ? జెఏసిలో ఉద్యోగ సంఘాల ఆదిపత్యం పెరిగిందా?టిఆర్ఏస్ ఏం చెయలనుకుంటుంది. జెఏసితో కలసి నడుస్తుందా ..జెఏసి నే మర్చాలనుకుంటుందా? జెఏసిలోని ఇతర సంఘాలేమనుకుంటున్నాయ్..మార్చ్ సబలో జేఏసి ప్రకటించిన ఉద్యమ కార్యచరణ ఏందుకు లెటవుతుంది?.

తెలంగాణ మార్చ్ పై రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా , దేశం మొత్తం పెద్ద చర్చే జరిగింది .. పక్కాగా రాజకీయజెఎసి ఆధ్వర్యంలో జరిగన ఇ కార్యక్రమం ఓకింత ప్రశాంతంగానే జరిగనప్పటికి తెలంగాణ సాదన కోసం పోరాటం చెసే సంఘాలు , పార్టిల మద్య అప్పటికే ఉన్న దురాన్ని మరింత పెంచిందనే బావన సర్వత్రా వెళ్లడవుతోంది... టి మార్చ్ పై మొదటినుంచి అంటిముట్టనట్టుగా ఉన్న కెసిఆర్ ఈ మర్చ్ లో జరిగిన కోన్ని సంఘటనల ద్వారా జెఏసి నేతలపై కోపంగా ఉన్నారని వినిపిస్తుంది..ఈటెల రాజేందర్ ను సభ జరుగుతున్న సమయంలో స్టేజిపైనుండి కిందికి దిగి జనాల్లో కుర్చోవాలని ,, హరిష్ రావ్ ను స్టేజి వెనకాల ఉండండంటూ టి ఉద్యోగసంఘం నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను అక్కడే ఉన్న కవిత కెసిఆర్ కు అప్పిటకప్పుడు ఫోన్లో వివరించడంతో సిరియస్ అయిన గులాబినేత తమవారిని వెంటనే మార్చ్ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని ఆర్డర్ వెశారంట... లక్షలాది మంది ని తరలించి బారి బహిరంగ సభలు నిర్వహించిన అనుబవం ఉన్న టిఆర్ఏస్ నే టి-మార్చ్ లో ప్రెక్షక పాత్ర వహించేలా చెయడమే కాకుండా అవమానించేలా ప్రవర్తించడంతో కెసిఆర్ జెఏసి గురించి తివ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం ..అయితె టిఆర్ఏస్ నేతలు మాత్రం చిన్నపాటి గ్యాప్ మాత్రమే ఏర్పడిందని..ఒకవెల ఏమైనా ఉంటే వాటిని సవరించుకునే ప్రయత్నం చెస్తామని జెఏసిని స్థాపించిందే టిఆర్ఏస్ అని చెప్పుకోస్తున్నారు...

తెలంగాణ మార్చ్ నిర్వహణలో చిన్న చిన్న లోపాలుజరిగాయని వాటివల్ల కోందరు నోచ్చుకునే అవకాశం కూడా లెకపోలెదని జెఏసిలోని ఇతర పార్టి నేతలు అంటున్నారు. జేఏసి గతంలో ఏప్పుడు ఇలాంటి భారి సబలు నిర్వహించిన అనుభవం లెనందున నిర్వాహకుల వల్ల కోన్ని పోరపాట్లు జరిగాయంటున్నారు..జెఏసిలోని బాగస్వామ్య పక్షాల మద్య దూరం పెరగకుండా ఏమేం చర్యలు చెపట్టాలో కూడా ఆలోచిస్తున్నట్లు వారంటున్నారు....ఇందుకోసం త్వరలో జెఏసి స్టిరింగ్ కమిటి మిటింగ్ ఏర్పాటు చేసి దానికి కేసిఆర్ తో సహా అందరిని పిలిచి సమస్యలు సామరస్యపుర్వకంగా సర్దుకునేలా చెస్తామంటున్నారు...మార్చ్ సబలో ప్రకటించిన ఇందిరాపార్క్ దిక్షలలాంటి జెఏసి కార్యక్రమాలను లెట్ అయ్యే అవకాశం ఉందని స్టిరింగ్ కమిటి మిటింగ్ తరువాతే చెపడతామాంటున్నారు జెఏసి నేతలు..

జెఏసి లోని ఉద్యోగ సంఘాల నేతలు,సిపిఐ న్యు డెమోక్రసి నెతలు కెసిఆర్ కలవడం కూడా నష్టనివారణ చర్యల్లో బాగమేనని అంటున్నారు..కెసిఆర్ ఏవరిని పిలవకపోయునప్పటికి జరిగిన పోరపాట్లను వివరించేందుకే వెళ్ళినట్లు వారు చెప్తున్నారు...త్వరలో కోదండరామ్ సైతం కెసిఆర్ ను కలిసెందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం... బాహాటంగా టిఆర్ఏస్ తో కలవడానికి ఇష్టపడని వారందరిని జెఏసి ద్వారా వినియోగించుకునే కెసిఆర్ జెఏసిని వదులుకోనే సాహసం చెయడంటున్నారు విశ్లేశకులు. ఏన్ని ఆగ్రహాలు , పట్టింపులు ఉన్నప్పటికి కలిసి నడవాల్సిందేనంటున్నారు..విడిగా చెస్తే వీరు సాదించేదిమి లెదంటున్నారు.. మరోవిదంగా చుస్తే కాంగ్రేస్ తో టిఆర్ ఏస్ విలీన వార్తల వినిపిస్తున్న తరుణంలో కేసిఆరే జెఏసిని దూరంగా ఉంచుతున్నారా అనే అనుమాలు రెకేత్తుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కెసిఆర్ ఏలాంటి నిర్ణయం తిసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లెదంటున్నారు... మా మద్య విబెదాలేం లెవని కోదండరాం అంటున్నప్పటికి కెసిఆర్ మాత్రం దినిపై స్పందించకపోవడం విరి మద్య గ్యాప్ రూమర్లకు బలాన్ని చెకుర్చుతున్నాయంటున్నారు...

తెలంగాణ మార్చ్ తరువాత ఢిల్లి లో ఏ మేరకు కదలిక వచ్చిందో కాని ప్రత్యేకరాష్ట్రోద్యమంలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు మాత్రం ఏర్పాడ్డాయు..అన్ని సంఘాలు, పార్టిలు ఓకరిపైఓకరు గుర్రుగా ఉన్నారు..ఇ సందిగ్ధ పరిస్థితి ఏటు దారి తిస్తుందోనన్నది అందరికి ప్రశ్నగానే మిగిలిపోతుంది..


Saturday, October 6, 2012

మీకు తెలియకుండానే మికు విషాన్ని ఇంజెక్ట్ చెస్తున్నాయు....


మిరు ఏ సూపర్ మర్కేట్ కో ,రైతుబజార్ కో వెళ్లినప్పుడు కూరగాయలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయా.....పెద్ద పెద్ద సైజలుతో..మంచి రంగుతో తాజాగ కనిపిస్తూ ఉరిస్తున్నాయా....కాస్త ఆగండి ...ఇవి చూడడానికి అందంగా ఉన్నా ...తాజాగా కనిపిస్తున్నా ..మీకు తెలియకుండానే మి ఓంట్లోకి విషాన్ని ఇంజేక్ట్ చెస్తున్నాయు.. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించే పండ్లు ,
కూరగాయలు ఆరోగ్యాన్ని కాకుండా ఆనారోగ్యాన్ని మొసుకోస్తూన్నాయు...

మనం తినే ఆహారంలో ఆరోగ్యకారకాలెన్ని? ,ఆనారోగ్యానికి దారితిసె అవశేషాలెన్ని ?. అసలు మనం ఏం తింటున్నాం కురగాయలనా?కాలకూటవిషాలనా? ప్రకృతితో మమేకమై సహజ వనరులతో,సేంద్రియ ఏరువులతో పాడిపంటలతో పండించిన పంటలను మనకు దూరం చేసిన పాలకులు...ఆధునికత పేరుతో చెసిన పోరపాట్ల పాపమే ప్రస్తుతం అయోమయ.. అస్థవ్యస్థ పరిస్థితి కి కారణం అయ్యారు....

ఆరోగ్యం కోసం ఆహరంలో కూరగాయలు,ఆకుకూరలు ఏక్కువగా తిసుకోవాలని డాక్టర్లు మనకు సూచిస్తారు...నిజంగా ఈ రోజుల్లో కూరగాయలద్వారా ఆరోగ్యం వస్తుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం ..ఏందుకంచే వాటిల్లోని రసాయన అవశేషాల మొతాదు రోజురోజుకి పెరిగిపోతుంది..ఇది ఏవరో చెప్తుంది కాదు సాక్షాత్తు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యుట్రిషన్ నిర్వహించిన సర్వేలే చెప్తున్నాయు..హైదరాబాద్ లోని కూరగాయలు, పల్లల్లో ఏకంగా 18 రకాల ప్రాణాంతక రసాయన అవశేషాలున్నాయు..విటిల్లో కోన్ని రసాయన మందులను మన ప్రభుత్వాలు 30సంవత్సరాలకు ముందే నిషేదించాయంట ...
సెంద్రియ ఏరువులతో పంటలు పండిస్తు దిగుబడితోపాటు ఆరోగ్యాన్ని పెంచుకున్న మన రైతన్న ను రసాయన ఏరువులు ,ఇతర ఫైర్టిలైజర్స్ దిశగ మళ్ళించాయు మన ప్రభుత్వాలు, రసాయన ఏరువులను విచ్చలవిడిగా మార్కేట్ లోకి వదిలి ఇదే అసలైన వ్యవసాయం అంటూ రైతుల పోలాల్లోకి ,ఓంట్లోకి రసాయనాలను వెదజల్లాయు..దిగుబడి పెరుగుతుందని ఆశ చూపి మొదటికే మొసం వచ్చేలా చెశారు..తాత్కాలికంగా దిగుబడి పెరిగినప్పటికి సారవంతమైన నెలను సాగుకు పనికి రాకుండా చెశారు...

వినియోగదారుల ఇంట్రెస్ట్ ను క్యాష్ చెసుకునెందుకు...తమ షాపుల్లోకి జనాలను ఆకర్శించేందుకు..కూరగాయలు ,పండ్లు ఆకర్షనీయంగా ఉండేందుకు రిటైల్ వ్యాపార సంస్థలు ఏంతటి దారునానికైనా ఓడిగట్టేందుకు సిద్దం అవుతున్నాయు..తమకు కావలిసిన రకం సరుకు ను పండించేందుకు రైతులను ప్రబావితం చెస్తున్నారు.. ఏ సమయంలో ఏ ఫేస్టిసైడ్స్ వాడితే రంగు , సైజు పెరుగుతాయే వాటిని రైతుల చెత వాడిస్తు తమ మార్కేట్ ను వృద్ది చెసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.....

హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాల చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల రైతులను రసాయన ఏరువులదిశగ ప్రోత్సహిస్తు తమ పబ్బం గడుపుకుంటున్నాయు రిటైల్ మర్కేట్ సంస్థలు..రిటైల్ రంగం వ్యవసాయం లోకి చోరబడకముందు ఇంతగా రసాయన ఏరువులను వాడకపోయేదని ఏందకంటే సైజు, రంగుతో పనిలెకుండా పంట పండించి అమ్మేవారిమని రైతులంటున్నారు..కాని సుపర్ మార్కేట్ వారు కోనలంటే సైజు పెద్దగా ఉండి... రంగు బావుండి తాజగా ఉండాలని అందుకే ఇంతగా మందులను వాడల్సివస్తుందని రైతులంటున్నారు...

దరలు పెరిగి కూరగాయలు కోనడానికే జంకుతున్న ప్రజలకు కోన్న ఆ కాస్త కూరగాయలు కూడా రసాయన అవశేషాలను మొసుకోస్తూ ఆనరోగ్యానికి దారితిస్తుండడంతో ఏం చెయాలో పాలుపోనిస్థితి ....అంతర్జాతియ సదస్సుల్లో సేంద్రియ పద్దతులగురించి ఉపన్యాసాలిచ్చే పెద్దలు ఇకనైన సమస్య ములాలు పై దృష్టి పెట్టి సమస్తజివకోటిని బ్రతికించిల్సిన అవసరం ఏంతైనా ఉంది....