Thursday, March 10, 2016

పూజా స్టోర్ ల శఠగోపం

.మానసిక బాదలు , ఆర్థిక ఇబ్బందులు, ఇంకా  ఎన్నో కష్టాలు......మరో వైపు... ఎన్నో ఆశలు  , ఉన్నత స్థాయిలో ఉండాలన్న కోరికలు....ఇవన్ని ఇప్పుడు కొందరికి కొత్త ఉపాది ని తెచ్చిపెడుతున్నాయ్... .. వింత వింత వస్థువుల తో పూజలు చెయాలంటు చెప్పె మొసగాళ్ల మాటలు ప్రజలు నమ్ముతుండడంతో పూజా స్టోర్ ల వ్యాపారం జోరందుకుంది.... బలహినతలే ఆసరాగా చెసుకోని ముడనమ్మకాల, అశాస్త్రియ పద్దతుల ప్రచారం వలలో పడి మద్య తరగతి జివి నలిగిపోతున్నాడు...
... మూడనమ్మకాలకు మన దేశం పెట్టింది పేరు, ప్రతి సంస్కృతి, మతం , ప్రాంతాల వారిగా వారికి తగ్గ విధంగా కొన్ని మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు. అందులో కొన్ని మూఢనమ్మకాలకు కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి, వాటిలో సిల్లీగా కూడా అనిపిస్తాయి కోన్ని అయినా ఫాలో అవుతున్నారు... దేశవ్యాప్తంగా ఉన్నఆధునీకరణ మరియు కొత్త జనరేషన్ వారు కూడా ఇటువంటి పిచ్చి మూడనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూడ నమ్మకాలతో పల్లెలు, గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఎక్కువుగా ప్రబలుతున్నాయి. అటువంటి మూఢనమ్మకాల ఆధారంగా నగరాల్లో కొత్త బిజినెస్ లు నడుస్తున్నాయ్... అవే... గతంలో ఎక్కడా కనిపించని పూజా స్టోర్ లు ఇప్పుడు గల్లికోకోకటి కనిపిస్తున్నాయ్...
.. ప్రతి మనిషికి ఎదో ఓ కష్టం ఉంటుంది...చాలా మందికి ఇంటిలో కలహాలు కామన్...వాటిని తిర్చేందుకు ఎదో సోల్యుషన్ కూడా ఉంటుంది ..కాని విలైనంత తోందరగా కష్టాలనుండి గట్టెక్కాలనుకునే  ఆతృత లో దెన్నైనా నమ్మేస్తారు...సరిగ్గా ఆలాంటి బలహినతలే ఆసరాగా చేసుకోని మొసపోతుంటారు...కష్టాలు తీరడం పక్కనపెడితే ..మరింత మానసిక , ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు... అలాంటిదే ఓ సంఘటన ...ఓ వారం రోజుల కింద నిర్మల్ లో జరిగింది ...ఈ సంఘటన పూజ ల పేరుతో మూడనమ్మకాలు ఎ స్థాయిలో ఉన్నాయో తెలియచెస్తుంది...
 మి ఇంట్లో కలహలా...మి పిల్లలు చదువులో  ప్రతిభ కనభర్చాలా... వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయా...మి ఇంట్లో ఎదో దోషం ఉండి ఉంటుంది ఆ దోశం పోవాలంటే ఈ రోజు రాత్రి ఎకనారి కేలం మి ఇంటి గుమ్మానికి కట్టండి అంటు ఓ స్వామిజి టివిలో  సెలవిచ్చారు......ప్రతి ఇంట్లో ఇలాంటి కోరికలు కామన్ కాబట్టి ... టివిల్లో అది చూసిన జనం పూజా స్టోర్ లకు పరిగెత్తారు...జనం బలహినత ను క్యాష్ చేసుకునేందుకు పూజా స్టోర్  వ్యాపారుల సిండికెట్  ఎకనారి కేలాలు లేవని హైదరాబాద్ నుండి తెప్పిస్తున్నాని కస్టమర్ లను తిప్పిపంపారు ...సాయంత్రం వరకు ఖచ్చితంగా కావాలని ముందే డబ్బులు సైతం ఇచ్చారు కస్టమర్లు...పది రూపాయల విలువ కూడా చేయని ఎకనారి కేలాలు ఎకంగా 600 రూపాయలు ధర ఫిక్స్ చేసారు... రాత్రి 9.30వరకు ఇంటి గుమ్మానికి కట్టాలి లేదంటే ఎదో జరుగుతుందనే భయంతో జనం పూజా స్టోర్ ల చుట్టు తిరిగారు...సాయంత్రానికి ఎకనారి కేలాలు అందుకున్న కస్టమర్ లు ఆశ్చర్యపోయారు... ఎకనారి కేలం అంటే ఎందో అనుకున్నారు... అది కేవలం ఓ కొబ్బరి కాయ పిందే..... కొబ్బరి కాయకు ముడు (రంధ్రాలు) కన్నులుంటాయి....అదే పిందె గా ఉన్నప్పుడు ఒకే రంద్రం (కన్ను) ఉంటుంది దాన్నే ఎకనారి కేలం అంటరని అప్పుడు తెలుసుకున్నారు...కాని ఎం చేయలేక సైలెంట్ గా తిసుకోని పోయి ఇంటి గుమ్మాలకు కట్టుకున్నారు...చాలా మంది ఇళ్లల్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి...కాని తెలుసుకునే సమయానికి ఆ శుభముహుర్తం అయిపోయింది...స్వామిజి అలా సెలవిచ్చారు మరి...
...ఇలా తాజాగా నిర్మల్ లో జరిగిన ఈ సంఘటన అంతటా జరుగుతునే ఉంది....అసలు గతంలో ఎప్పుడు వినని ఎ  శాస్త్రాల్లో ఉన్నాయో ఎవరికి తెలియని కొత్త వస్తువులు ...పూజా స్టోరో లలో అమ్మకానికి పెడుతున్నారు...అందుకు తగ్గట్టు స్థానికంగా కొంత మంది ..టివిలు ఇతర ప్రసార మాద్యమాల్లో కొంత మంది ప్రజలను ముడనమ్మకాల్లోని ముంచేస్తున్నారు... ప్రతి  ఉరి కి  ఓక్కో స్వామిజి ఉంటు భక్తులను పూజల పేరుతో మొసం చేస్తుండడంతో   పూజా స్టోర్ ల వ్యాపారం జోరందుకుంటుంది..ప్రతి గల్లి కి ఓ  కిరిణా షాపు ఎట్లా ఉంటుందో అట్లా ఇప్పుడు పూజా స్టోర్ లు ఉంటున్నాయ్...  ఆ షాపుల్లో ఎప్పుడు మనం వినని వింత వింత వస్తువులు అమ్మకానికి పెడుతున్నారు...
... ఎ శాస్త్రాల్లో ఎవరు చెప్పారో కూడా తెలియని వస్తువుల జాబితా ఆ షాపుల్లో ఉంది...స్థానిక జ్యోతిష్కులు జాతక దోషాల పేరుతో బయపెట్టి నివారణ కు పూజలు చేయాలంటుడడంతో బయంతో ఎదంటే అది చేస్తున్నారు....వందల సంవత్సరాల క్రితం ఆ కాలంలో దోరికిన వస్తువులతో పూజలు చేసారు... అప్పుడు అవే దోరికేవి అందుకే వాటినే వాడేవారు..ఇప్పుడు కూడా వాటితోనే పూజలు చేయలనుకోవడం మూడనమ్మకమేనని పలువురు అబిప్రాయపడుతున్నారు....పలనా వస్తువుతోనే పూజలు చేస్తేనే దేవుడు కరుణిస్తాడనడం మూర్ఖత్వమేనని కోట్టి పారేస్తున్నారు..   మాన పసుపు, కస్తూరి పసుపు, కచ్చూరాలు, బాంచాలు, అతిమధురం, పిప్పళ్లు, ఆశ్వగంధ, వన, వాయు మిరియాలు, కలకండ, మంజిస్ట, ఆకుపత్రి నాకేశ్వరాలు, ఆవాల నూనె, విప్పనూనె, చిన కరక పిందెలు, చెంగల్వా కోస్టు, గుంట గలగరాకు ,సరస్వతి ఆకు, తెల్లఆవాలు, పెద్ద ద్రాక్ష, దానిమ్మ బెరడుసరస్వతి ఆకుపోడి, ఉసిరిగ పొడి, గుంటగలరాకు పొడి, మారెడు గుజ్జు, ఆకుపొడి, త్రిఫల చూర్ణం, పూజా నూనెలు, ఆయుర్వేద తైలములు, పాద రస లింగాలు, శ్రీ చక్రాలు, మెటల్‌ సింహాసనాలు, పీటలు, మెటల్‌ పైపు పూజా సామాగ్రి, గోపురం సామాగ్రి, స్వాతి హెర్బల్స్‌, , ధర్భాసనాలు, కమండలాలు, మునికర్రలు ఇట్లా ఎన్నో వస్తువులు అమ్మకానికి పెడుతున్నారు...  పేద మద్య తరగతి ప్రజలు ఇలాంటి మాయల్లో పడి డబ్బు విలువైన సమయం వృదా చేసుకోవడమే కాకుండ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించకుండా దేవుడి పై బారం వెస్తు సమస్యలను ఝటిలం చేసుకుంటున్నారంటున్నారు హేతువాదులు...మారుతున్న కాలానికి అనుగునంగా మారుతూ ఎవరు ఎది చెప్తే అది చేసేయడం మాని రానున్న తరాలకైనా ప్రశ్నించే తత్వం నేర్పాలని జనవిజ్ఞాన వేధిక లాంటి సంస్థలు కోరుతున్నాయ్...