Sunday, November 18, 2012

అవిశ్వాసపు కూనిరాగాలే వినిపిస్తున్నాయి....


ఇప్పడు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీని కదిపిన అవిశ్వాసపు కూనిరాగాలే వినిపిస్తున్నాయి. ఎవరైనా అవిశ్వాసం ప్రవేశపెడితే ప్రభుత్వాన్ని మేం కూల్చేస్తామని జగన్ బ్యాచ్ భీరాలు పలుకుతుండగా... ఆ పనేదో మీరే చేయవచ్చుగా ... మీ చేతగాదా అని టీడీపీ ఎదురు ప్రశ్నిస్తోంది. ప్రజల కోసం కాకుండా... జగన్‌ బేరసారాల కోసం అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. అటు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించేవారికి తమ వంతు సాయం తప్పకుంటుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. విపక్షాల దూకుడుకు అధికార పక్షం కూడా ధీటుగానే స్పందిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తర్వాత అవిశ్వాసం అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికున్న స్టామినా ఎంతో తెలియదు గాని... అసలు విపక్షాలకు అవిశ్వాసం పెట్టే ఉద్దేశం ఉందా అన్నదే ఇప్పుడు అంతుపట్టని అంశం. పైకి మాత్రం టీడీపీ, జగన్ పార్టీ, టీఆర్ఎస్‌తో సహా అన్ని పార్టీలు కిరణ్ సర్కార్‌కు నూకలు చెల్లిపోతున్నాయంటూ కేకలు వేస్తున్నాయి. అవిశ్వాసం విషయంలో జగన్ పార్టీ చాలా తెలివిగా దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని జనాన్ని నమ్మించేందుకు ... పదేపదే అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నాక కూడా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని హడావిడి చేస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించండి మద్దతిస్తాం లేదా మేమే అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తాం మీరు మద్దతివ్వండంటూ టీడీపీ ముందు జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి ఓ తెలివైన ప్రతిపాదన కూడా ఉంచారు. అయితే ఇందుకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతూ మీకు మద్దతిస్తున్న ఓ ఐదుగురు ఎమ్మెల్యేలను గవర్నర్ దగ్గరకు పంపితే కిరణ్‌ సర్కార్ కూలిపోతుందని సలహా ఇచ్చింది. ప్రజాసమస్యలపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము సిద్ధమేనని అయితే... జగన్ బేరసారాలు, బ్లాక్ మెయిల్‌ కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
అటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా కిరణ్‌ సర్కార్ మనుగడపై అనుమానం వ్యక్తం చేశారు. మరో 15 రోజులకు మించి కిరణ్‌ ప్రభుత్వం కొనసాగే సూచనలు లేవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పతనాన్ని ఆపే శక్తి ఎవరకీ లేదన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెడితే... తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అయితే... విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ పార్టీకి దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్టు సవాల్ విసిరారు. టీడీపీతో కుమ్మకై రాజకీయాలు నడుపుతోంది జగన్ పార్టీయేనని విమర్శించారు


Sunday, November 4, 2012

చెట్టుకు కట్టెసి కాల్చిచంపారు...



జంపాల...
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్...1975 నవంబర్ 5 ఖమ్మం జిల్లా ఇల్లెందు అడవుల్లో చెట్టుకి కట్టెసి మరి కాల్చిచంపారు... ఆయన పేరు జేసీఎస్ ప్రసాద్... జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్.. భారత విధ్యార్ధి ఉద్యమంలో చెరగని పేజీ జంపల...ఈ దేశంలో అసమానతలు లేని రాజ్యం రావాలని కలలు కన్న జార్జి రెడ్డి వారసుడు... ఉస్మానియా ఇంజనిరింగ్ కాలేజీ విద్యార్ధి... ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమ నిర్మాత... ఓయు క్యాంపస్ లో చెలరేగిన కొన్ని అభ్యుదయ భావాలను రాష్ట్ర వ్యాప్తగా వేదజల్లిన నాటి స్టుడెంట్ లీడర్... జంపాల చంద్రశేఖర్ ప్రసాద్... పుట్టింది నిజమాబాద్ జిల్లా బోధన్ తాలుకా ఎత్తోండ గ్రామం... మద్య తరగతి కుటుంబం... అందరి విద్యార్ధుల మదిరిగానే తల్లి తండ్రుల అనంతమైన ఆశలను మోసుకుంటూ ఉస్మానియా క్యాంపస్ చేరుకున్నాడు జంపాల... కాని అక్కడి పరిస్ధితులు ప్రసాద్ ను చదువుకోనివ్వలేదు... అప్పటికే జార్జి రెడ్డి నాయకత్వంలో ఓయు ఉద్యమాలకు ఖిల్లగా మారింది...
అ నాటి దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్ధితుల్లో మార్పు ఆవసరమని గుర్తించిన విద్యార్ధుల్లో ప్రధాముడిగా నిలిచాడు జంపాల ప్రపాద్.... సనాతన దర్మాలకు... తాతా గారి భామ
్మ గారి భావాలకు నీళ్ళు వోదిలి... అప్పుడే ఎగసిపడుతున్న ప్రగతీశీల ఉద్యమానికి నాయకత్వం వహించాడు... జార్జి రెడ్టి వోదిలిన జీనాహైతో మర్న సీగో కథం కథం పర్ లాడ్న సీగో అనే నినాదన్ని అందిపుచ్చుకోని .... అలజడి మా ఉపిరి... ఆందోళన మా వేధంతం... తిరుగుబాటు మా సిద్దాంతం... అంటూ నినాదించాడు జంపాల ప్రసాద్.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పీడీయస్ యు) తొలి నాయకుడు... ఈ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలోనే జేసీయస్ ప్రసాద్ ను నాటి వెంగల్ రావు పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో కల్చిచంపారు. సరిగ్గా నవంబర్ 5 1975 రోజున ఖమ్మం జిల్లా ఇల్లెంద్ అడవుల్లో ప్రసాద్ ను చంపిచేశారు. నాటి నుంచి ఉయ్యాలో జంపాల... ఈ దోపిడి కూలదోయ్యల... అంటు భారత విప్లవ విధ్యార్ధి ఉద్యమం పాడుతూనే ఉంది... జేసీయస్ ఆశయ సాధన కోసం అనేక త్యాగాలను అయన నిర్మించిన విద్యార్ధి సంఘం చేస్తూనేవుంది... ప్రతి ఏడు జంపాల ప్రసాద్ ను అయన సహచారులు, తోటి మిత్రులు, ఉద్యమకారులు స్మరించుకుంటూనే ఉన్నారు.... అయితే నాడు ఆయనకు అనుచరులుగా ఉన్న వారందరూ ఒకచోటికి చేరి జంపాల జ్ఞాపకాలను, ఉద్యమాల సవ్వడిని స్మరించుకోవడంతోపాటు ఒకరికొకరు అభివూపాయాలనుపంచుకోవడానికి ఆదివారం ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో గల హరిత గార్డెన్స్‌లో సంస్మరణ సభను నిర్వహించుకున్నారు. ఈ సభకు 1972లో ఓయూలో విద్యనభ్యసించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు ఇతర దేశాల్లో స్థిరపడిన వారందరూ హాజరైనారు..కేవలం ఖమ్మంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతట జంపాల ప్రసాద్ వర్ధంతులు జరుపుకుటున్నారు... పాత, కొత్త తరం విద్యార్ధులు జంపాలను స్మారించుకుంటు సూతన వ్యవస్ధను స్వప్నిస్తున్నారు... ఎల్లలు లేని విశాల ప్రపంచాం కోసం ఎదురు చూస్తున్నారు.........................................

Thursday, November 1, 2012

నిజ జీవితంలోనూ సినిమాలోలాగ నటిస్తున్నారు..............


మొహన్ బాబు ఫ్యామిలి నిజ జివితంలో కూడా సినిమాలో నటించినట్లు నటిస్తున్నారు....చంపేస్తాం నరికేస్తాం అంటూ ఓపెన్ గా మిడియా ముందే బేదిరింపులకు పాల్పడుతున్నారు ...బుదవారం రాత్రి జరిగిన సంఘటనలు యదాతథంగా........
బ్రాహ్మణ సంఘాల యువకులు ఇంటిముందుకు వస్తున్నారని ముందే తెలుసుకున్న మొహన్ బాబు అనుచరులు దాడి చెయడానికి సిద్దం అయ్యారు...సెక్యురిటి రూమ్ లో దాచిన ఫైబక్ స్టిక్స్ తిసుకోని దెనికైనా రెడి అంటూ సిద్దం అవుతుండగా...మీడియా కెమేరాలు చిత్రికిరించాయు..ఓ తెల్ల బట్టలేసుకున్న వ్యక్తి (మొహన్ బాబు మేనేజర్) కెమేరాలతో షుట్ చెయకండి అంతా అయుపోయున తరువాత మిమ్మల్ని పిలుస్తాను అప్పటివరకు కార్ లో కుర్చోండంటూ వేడుకున్నాడు...అక్కడున్న వారు మాట విన్నట్టు కనపడకుండా పోయో సరికి బేదిరించడానికీ సిద్దం అయ్యాడు ...అప్పటికే బ్రాహ్మణ సంఘాల వారు వస్తున్నట్లుగా దూరం
నుండి కనబడడంతో వారిపై దాడికి మొహన్ బాబు సెక్యురిటి సిబ్బంది దాడి చెయడానికి పగిగెత్తారు...అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ బ్రాహ్మణుల్ని ఆపి మాట్లాడుతున్నారు..అదే సమయంలో ఫైబర్ లాఠిలతో దాడి

ప్రారంభం అయింది...తప్పించుకోని పోతున్న వారి బైక్ ల వైపు లాఠిలు విసరడంతో కోంతమంది కిందపడి గాయపడ్డారు.. మరికోంతమంది కింద పడగా వారిని కాలితో తోక్కుతూ వారి కసి తిర్చుకున్నారు..రోడ్డుపై వేళ్తున్న ఇతరులపై సైతం దాడి చేసి వారి వాహనాలను పగలగోట్టారు...ఇదంతా ఒక వైపు జరుగుతుండగా మరోవైపు.మరికోంత మంది సిబ్బంది గెటు ముందు ఉన్న లైట్లను పగలగోట్టి కోన్ని రాళ్ళు విసురుకున్నారు ...ఇదంతా మిడియావారి ముందే జరిగింది అపుడే బయటోకోచ్చిన విష్ణు .."లోపలికి రండిరా" అంటూ పరుష పదజాలంతో విరుచుకపడ్డారు..మీడియాను సైతం బెదిరించారు....నిజంగా సినిమా షుటింగ్ ను తలపించే లా కోన్ని సంఘటనలు మా ముందే జరిగాయి....ఇంటిమిదికి దాడికి రాకముందే...రాళ్లు విసరకముందే...ఏవీ పగలకముందే...మాపై దాడి దరిగిందంటూ మీడియాకు చెప్పడంతో ...తెల్లబోవడం మావంతైంది...వీజువల్స్ లో కనబడుతున్న సంఘటనల్ని సైతం జరగలేదంటూ చెప్తుండడంతో వారి నటనా చాతుర్యం మాకూ.. అర్థం అయింది....

మొహన్ బాబు గతంలో కూడా తెలంగాణ పై నోటికోచ్చినట్లు మాట్లాడి ఆ ప్రాంతం వారితో వైరం కోని తెచ్చుకున్నాడు...ఇష్యు పెద్దది కావడంతో సైలేంట్ అయి మళ్లి అలాంటి మాటలు మట్లాడ్డంలేదు...గత కోన్నేళ్లుగా మొహన్ బాబు ఫ్యామిలి తిసే సినిమాలేవి హిట్టు కోట్టలేదు... ఒరకవేళ హిట్ అయితే ఇంటి ముందునుంచి వేళ్లేవాళ్లను సైతం కోడతారని...వ్యంగ్యంగా కోంత మంది మొహన్ బాబు పై ఒ కామేంట్ చెయడం బుదవారం రాత్రి సంఘటనతో నిజమైందనిపించింది...సినిమాకు ఫ్రి పబ్లిసిటికోసం వివాదాలు చెస్తారనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది..ఇప్పటి ఇ సంఘటన ద్వార పబ్లిసిటి ఏమొగాని ఇలా దాడి చెయడం ద్వారా మొహన్ బాబు ఫ్యామిలి సినిమాలను భవిష్యత్ లో బ్రహ్మణులు వ్యతిరేఖ కోణంలో చుస్తారు....అనవసరంగా ఓ వర్గాన్ని ఒ ప్రాంతాన్ని దూరం చెసుకోవడమే...ఇపుడంటె సినిమా కాస్త బాగుంది చుస్తారు అన్నిసార్లు అలా జరగదు కదా అపుడు ఇదే సిని తారలు ప్రేక్షక దేవుళ్లు అంటూ మీడియా ముందు సినిమా చూడండంటూ వేడుకుంటారు..... సినిమాల్లో సవాల్ విసిరితే బాగుంటుంది...హిరో ఏవరిని కోట్టిన ...ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది ..కాని రియల్ లైఫ్ లో అలాకాదు ...............ఏందుకంటే వీరు రియల్ లైఫ్ లో హిరో లు కారు కాబట్టి.....