Wednesday, November 26, 2014

చలి

ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో చలి ఉగ్రరూపం దాలుస్తున్నా..అధికార యంత్రంగాం మాత్రం మెల్కోవడం లేదు.. 4 డిగ్రిల చలి ఉందని ప్రకటిస్తునే గిరిజన ఆశ్రమ పాఠశాల విధ్యార్థులకు రగ్గులు పంచాలన్న మాటే ఎత్తడం లేదు.. కిటికిలు , వెంటిలేటర్లు సరిగా లేక ...వాటినుండి వచ్చే చలిగాలులతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

వాయిస్...  జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు 50 ఉండగా వాటిల్లో 3,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రారంభంలో పంపిణీ చేయాల్సిన దుప్పట్లను ఇప్పటికీ ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వకపోవడం వారి దుర్భరస్థితికి అద్దంపడుతుంది. ఓక్కో విధ్యార్థికి రెండు దుప్పట్లు ఇవ్వాల్సి ఉన్నా.. కేవలం ఒక్క సన్నని చద్దరితో  సరిపెట్టారు. చలికాలంలో ఇవ్వాల్సిన రగ్గుల వూసేలేదు. ఐటీడీఏ పరిధిలో 123 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో 37వేల మంది విద్యార్థులున్నారు. అందరికీ దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవి నాణ్యంగా లేకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నాయి. వసతి గృహాల్లోని కిటికీలు లేకపోవడంతో దుప్పట్లను కిటికీలకు అడ్డుగా పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చలిని తట్టుకోవడానికి 37వేల మందికి ఉలెన్‌ రగ్గులు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 11వేల మందికి మాత్రమే సరిపడా రావడంతో మిగిలిన విద్యార్థులకు అవిలేక అవస్థలు పడుతున్నారు.
వాయిస్.. గత ప్రభుత్వ హయాం నుంచే విద్యార్థులకు దుప్పట్లు సరఫరా చేయడంలేదు. దీంతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులే సొంతగా దుప్పట్లు కొనుగోలు చేసి సరఫరా చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పాలనాధికారి, ఇతర అధికారులు వసతి గృహాలను సందర్శించి అక్కడే రాత్రి నిద్రపోయేవాళ్లు. అప్పట్లో అక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి నిధులు వెచ్చించి భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వసతి గృహాలను సందర్శించి రాత్రి అక్కడే పడుకుంటే విద్యార్థుల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో అటవిశాఖా మంత్రి జోగు రామన్న ఓ హస్టల్లో నిద్ర చేసాడు కుడా..
 వాయిస్... పాలనాయంత్రాంగం కొలువు దీరిన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణంలో కూడా విద్యార్థులకు దుప్పట్లను అందించలేదు. పట్టణంలోని కోలాం వసతి గృహాన్ని మంత్రి, కలెక్టర్ పరిశీలించగా అధికారులకు ఏమాత్రం అలసత్వం స్పష్టమైంది. చలితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపైన కూడా దయ చూపలేదు. చలికాలంలోనూ దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు ఇంటినుంచే బొంతలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొలాం ఆశ్రమ పాఠశాలలో 562మంది విద్యార్థులుండగా 100మందికి మాత్రమే దుప్పట్ల పంపిణీ చేశారు. మిగిలి వాళ్లంతా చలికి గజగజ వణికిపోతున్నారు.బేల మండలంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో 265మంది విద్యార్థులుండగా.. 150 దుప్పట్లు మాత్రమే సరఫరా చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక్కో దుప్పటి చొప్పున పంపిణీ చేశారు. ఒక్క దుప్పట్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వాయిస్... బోథ్‌ నియోజక వర్గం బజార్హత్నూర్‌లో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో దుప్పట్లను సరఫరా చేయకపోవడంతో చలికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేరడిగొండలోని కొరటికల్‌ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఒక్కరికీ దుప్పట్లు అందించలేదు. కుంటాలలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాల, తలమడుగులో ఉమ్రి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాంసి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులే వసతికి ఉపయోగించాల్సిన దుస్థితి నెలకొనడంతో చలికి ఇబ్బందులుపడుతున్నారు. కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలికి వణికిపోతున్నారు.
వాయిస్... ముథోల్‌ నియోజక వర్గంలోని బాసరలోని బీసీ, కుభీర్‌, తానూరులలోని ఎస్సీ వసతి గృహాలకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన దుప్పట్ల సరఫరా చేయకపోవడంతో చలికి విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్‌పట్టణంలోని బీసీ వసతి గృహానికి తలుపులు, కిటికీలు లేవు. అందరికీ దుప్పట్ల పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా.. సగం మందికే ఇచ్చారని పిల్లలు చెబుతున్నారు.తిర్యాణి మండలంలోని మంగి ఆశ్రమ పాఠశాలలో 204మంది విద్యార్థులుండగా.. చలికి తట్టుకోలేక దాదాపు 170 మంది విద్యార్థులు బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోంపెల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వాయిస్... ఉట్నూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 600మంది విద్యార్థులుండగా వసతి గృహానికి కిటికీల్లేవు. సరిపడ దుప్పట్లు పంపిణీ చేయలేదు. సరఫరా చేసిన దుప్పట్లు కూడా నాసిరకంగా ఉండటంతో చలికి తట్టుకోలేకపోతున్నాయి. ఎందా ఆశ్రమ పాఠశాలలో 323మంది విద్యార్థులు చదువుతున్నా.. కిటికీలు పగిలిపోవడంతో చలి ఎక్కువగా వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగాం గిరిజన ఆశ్రమ పాఠశాల అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల ఉలెన్‌ రగ్గులు సరఫరా చేేయకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. బీసీ వసతి గృహంలో దుప్పట్లు సరపడా పంపిణీ చేయలేదు. జన్నారం మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలి ఇబ్బందులు తప్పడంలేదు. ఎస్సీ బాలుర వసతి గృహం మూతపడ్డ పాఠశాలలో కొనసాగిస్తుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులిక్కడ చలికి తట్టుకోలేక ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు..
వాయిస్... బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి ఎస్సీ వసతి గృహానికి నాసిరకమైన దుప్పట్లు సరఫరా చేయడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని సింగరేణికి చెందిన భవనంలో నిర్వహిస్తున్నారు. రక్షణ లేకుండా పోయింది. తాండూరులో ఎస్సీ బాలుర వసతి గృహానికి కిటికీలు లేక చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. కాసిపేటలోని రేగులగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలోనూ కొందరికే దుప్పట్లు పంపిణీ చేశారు. అవి కూడా నాణ్యత లేకపోవడంతో చలిని ఆపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

No comments:

Post a Comment