Thursday, February 11, 2016

యునివర్సిటి కోసం గిరిజనుల పోరాటం

నాగోబా జాతరలో బాగంగా జరిగిన దర్బార్ కార్యక్రమం నిరసణలతో అట్టుడికింది....ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యునివర్సిటి ఎర్పాటుచేయాలని డిమాండ్ చెస్తు గిరిజన సంఘాల నాయకులు మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకున్నారు...పోలిసులు వారిని అరెస్ట్ చేసిన తరువాత సభలో మరికోంత విధ్యార్థి సంఘాల వారు ఆందోళన చెపట్టారు...గిరిజన యునివర్సిటి పై స్పష్టమైన హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు....సభలో ఉన్న మంత్రులు జోగు రామన్న , ఇంద్రకరణ్ రెడ్డిల కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు...


...నాగోబా జాతర సమయంలో ఎక్కడెక్కడో ఉన్న గిరిజనులంతా జాతరకు వస్తుంటారు...గిరిజన సమస్యలపై అక్కడే అధికారులు , ప్రజాప్రతినిధులు ఫిర్యాధులు స్వికరించే విధంగా దర్బార్ ఎర్పాటు చేస్తారు ...ఈ పద్దతి నిజాం కాలంలో కోమురం బీం మరణం తరువాత అప్పటి ప్రభుత్వం హైమన్ డార్ఫ్ అనే శాస్త్రవేత్త సూచన మేరకు ఎర్పాటు చేసింది....ఈ దర్బార్ లో సమస్యలపై అధికారులు అక్కడే స్పందించి చర్యలకు పునుకోవడం లేదా మళ్లి వచ్చే దర్బార్ వరకు చేసేస్తాం అని చెప్తుంటారు...

.. గిరిజన యూనివర్సిటి కోసం పోరాటం చెస్తున్న గిరిజన సంఘాలు ,యువజన సంఘాలు దర్బార్ లో నిరసణ వ్యక్తం చేయడం పట్ల జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసహణం వ్యక్తం చేసారు...గిరిజన పండుగల్లో మీ రాజకీయాలేంటని...మొన్నటి ఎన్నికల్లో మీ పార్టిల పరిస్థితి చూసి కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారా అంటు మండిపడ్డాడు...గిరిజన యునివర్సిటిి కోసం అవసరమైతే అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం అని ఇలాంటి రాజకీయాలు చేస్తే బాగుండదని మండిపడ్డాడు... నిరసణ వ్యక్తం చేసిన సంఘాల నేతలను అరెస్ట్ చేసి గుడిహత్నుర్ పోలిస్ స్టేషన్ కు తరలించారు....

No comments:

Post a Comment