Thursday, February 11, 2016

ఆదివాసులు మిగిలన కొద్దిపాటి మూలవాసి సమూహాల గుర్తులు


ఆదివాసులు మిగిలన కొద్దిపాటి మూలవాసి సమూహాల గుర్తులు ... ఆదునిక సమాజం హైందవం పేరుతో వారి ఆహారానికి,ఆహార్యానికి దూరం చేస్తోంది.. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో గోండు గిరిజనుల్లోని మెస్రం వంశస్థులు జరిపే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర....ఈ జాతర వారి జివితానికి సంబందించింది...చెట్టుకోకరు గుట్టకోకరు నివసించే గోండులు , కోలామ్ లు , పరదాన్ లు అనే గిరిపుత్రులు ఈ జాతరతో కలుస్తారు...తమ బందువులను కలవడమే కాదు కోత్త బందాలకు నాంది ఈ నాగోబా జాతర...వారం పది రోజుల పాటు జాతర కోసం ఎడ్ల బండ్ల పై , కాలి నడక న ఇంద్రవెళ్లి మండలంలోని కెస్లాపుర్ కు తరలివస్తారు... దారిలో ఎంతో నిష్టగా క్రమశిక్షణతో ప్రకృతితో మమేకమవుతునే నాగోబా చెంతకు చెరుతారు.. నాగోబా జాతరలో ప్రధానంగా జంతువుల బలి ఇచ్చి తర్వాత వాటితో పండుగను ఆస్వాదించడం గిరిజనులు ఆనవాయితి...కాని ఇప్పుడు ప్రభుత్వాలు అదికారిక జాతరగా జరపడం
జంతు బలులు నిషేదించడం అంతా జరిగిపోయింది...జాతరను ఎన్నో సంవత్సరాలుగా చేస్తు వస్తున్న అడవిబిడ్డలకు రాను రాను తమ ఆచారలను పద్దతులు ఎవరో గుంజుకుంటున్నారనే బావన కలుగుతుంది...ముందు నాగోబా జాతర అంటే గిరిజనులది మాత్రేమే కాని ఇప్పుడు మైదాన ప్రజలు వస్తుండడంతో వీరి సాంప్రదాయాలు పోయి వారి ఆదునిక పోకడలు పెరిగి పోతున్నాయ్...ఇదే మాట నలబై యెండ్ల కింద నాగోబాను సందర్శించిన హైమన్ డార్ప్ తన పరిశోధనా పుస్తకాల్లో రాశారు.... ప్రతియేట తమదైన పండగను తమకు కాకుండా చెస్తున్నారనే కోపాన్ని పంటి కింద
అనుచుకుంటున్నారు గిరిజనులు... పాత తరానికి చెందిన సాంప్రదాయ గోండు పెద్దలు ఎక్కడికో పరాయిదేశానికి
వచ్చామన్న భావనతో ఉన్నారు...గోండులకోసం గోండుల చేత జరుపుకునే స్వంత ఉత్సవంలో ఇప్పుడు పూర్తిగా బయటివాల్లమైపోతున్నామనే బాదపడుతున్నారు...సురుజి మహరాజ్ సంస్కరణోద్యమం పేరుతో పూర్తిగా హైందవికరించబడ్డామని మరికోందరు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు....ట్రైబ్స్ అఫ్ ఇండియా ...ద స్ట్రగుల్ సర్ వైవల్ అనే పుస్తకంలో హైమన్డార్ఫ్ గోండుల స్థితిగతులపై నాగోబా జాతర పై పరిశోదించి రాసిన వ్యాసాలలో అప్పటి పరిస్థితి వివరించారు....... పూర్తిగా మెస్రం వంశస్థులదే అయిన నాగోబా ఆలయం... 1977 లో కేస్లాపుర్ లోని నాగోబా దేవాలయ కమిటి లో మర్సకోల కాశిరాం ( అధ్యక్షుడు) ఉన్న సమయంలో దేవాదాయ శాఖ సిబ్బంది కోశాదికారిగా ఉండేవారు...ఆ సమయంలోనే పూర్తిగా మెస్రం వంశస్థులు పట్టు కోల్పోయి.. గోండులకు హిందువులకు కలిపి ఓకే
దేవాలయంగా మార్చేసారు...ఈ ఆలయాన్ని గణ పూజారి మెస్రం నాగు వ్యతిరేఖించాడు...మన సంప్రాదాయలన్ని పోయి హైందవ సాంప్రదాయంలో మనం మగ్గిపోవాల్సి వస్తుందని తన జాతికి అధికారులకు వివరించాడు..కాని ఆయనను పట్టించుకోలేదు...చివరకు ఆయన భయాలన్ని నిజమయ్యాయి....
పై మాటలు మనవ పరిణామ శాస్త్రవెత్త హైమన్ డార్ఫ్ తన పుస్తకం లో రాసుకున్నారు.... అప్పుడే అట్లా ఉంటే ఇప్పటి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి..ʹʹమేం జంతుబలులు చేసేది యజ్ఞ యాగాదుల్లో దహనం చేయడానికి కాదు...మేం ఆహారంగా తినే జంతువులనే దేవుని మందు కోస్తాంʹʹ అని ..దాని ద్వారా తమ దేవుల్లకు తమ ఆహారాన్ని నైవేద్యంగా ఇస్తామని గిరిజనులు అంటున్నారు..... ప్రతిరోజు  నగరాల్లో, టౌన్ లలో మటన్ షాప్ లు చికెన్ షాప్ లలో జంతువులును చంపడాన్ని జంతుబలులుగా చూడని వారు తమ ఆహారాన్ని మాత్రమే జంతుబలులుగా ఎందుకు చూస్తారని మండిపడుతున్నారు.... మా సాంప్రదాయలని మాకు వదిలేయాలని
హైందవికరించి మా హక్కులను హరించవద్దని గిరిదనులు డిమాండ్ చెస్తున్నారు... సంవత్సరానికోసారి కలుసుకునే బందువులంతా సంతోషంగా ఉండే పండుగను మాకే వదిలేయాలని కోరుతున్నారు...... గోండులకే పరిమితమైన వారి ఆచారాలలో ఇతరుల పెత్తనం పెరిగి పోవడంతో చేసేదేం లేక గుడి వెనక దూరంగా ఓ చిన్న గుడిసెలో తమ పెంపుడు కోళ్లు , మెకలను బలి ఇస్తు తింటున్నారు...గుడి ముందు మాత్రం హిందు సాంప్రదాయలను పాటిస్తు తమకు అంతకు మందెన్నడు తెలియని కోబ్బరికాయలు కోట్టే సంస్కృతిని అలవాటు చెసుకున్నారు....

No comments:

Post a Comment