Saturday, August 25, 2012

వంద సీట్లిస్తామంటే నమ్మేస్తారా....

సహజంగానే 2014 ఏన్నికల కలలో అన్ని పార్టిలు విహరిస్తున్నాయ్.. గెలుపు దారులను వెతుక్కునే పనిలో హాడావిడి మొదలుపెట్టాయు... అప్పుడేప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహీంచి ప్రజలకు సైతం అందనంత ఏత్తుకేదిగిన హైటెక్ చంద్రబాబు అదే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఏంతగానో కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాడు.. ఒక్కో సమస్యను నరుక్కుంటూ దూసుకుపోతున్నాడు ..మొన్నామద్య వెనుకబడిన తరగతుల వారికి వంద టిక్కెట్లు అంటూ బిసిలను మరోసారి టిడిపికి దగ్గర చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు.దింతో బిసి సంఘాల నేతలు బాబుగారిని సన్మానించేందుకు క్యూ కట్టారు .ఇదంతా చూసిన YSRCP నేతలు మనం తక్కువ తిన్నాం అంటూ వంద టిక్కెట్లు కాదు, వంద సీట్లు ఇవ్వాలని వారి గౌరవాధ్యక్షురాలి చే ప్రకటింపచేసారు..తాజాగ ఈ రోజు ఆ పార్టి బిసి నేత గట్టు రాంచందర్రావ్ తో బిసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సైతం ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు..

పార్టిల గతం ప్రజలు మరిచిపోతారా?

బాబు గారు ప్రజా సమస్యలపై ఏప్పుడు ప్రజలవద్దకేళ్లిన గతంలో మిరేం చేశారు.. అనే ప్రశ్నే ఏదురవుతుంది అందుకే 2004లో సైతం జనాలను నమ్మించడంలో విఫలం అయ్యారు....మరి 2014 వరకైనా ప్రజలు బాబు గతం మరిచి ఓట్లేస్తారో లేదో అనేది పెద్ద ప్రశ్నే..అలాగే YSRపార్టి బిసిలకు వంద సిట్లు పధక ప్రచారంలో బాగంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బిసి సంఘాల నేత కృష్ణయ్య గతంలో YS రాజశేఖర్ రెడ్డి హామిలను గుర్తు చేశారు.చట్టసభల్లో బిసిలకు ఇస్తామన్న50శాతం రిదర్వేషన్ల లాంటివాటిని లేవలేత్తారు. ముందు గతంలో ఇచ్చిన డిమాండ్లపై క్లారిటి కావలన్నారు ..ఇలా బిసిల రాగం అందుకున్న రేండు పార్టిల గతం వారి భవిష్యత్ పై ప్రభావం చుపే అవకాశం లేకపోలేదు....





No comments:

Post a Comment